వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

Update: 2019-03-20 13:39 GMT

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి జంప్ అవ్వడం కామన్. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకొని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఐజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలో పోటీలో ఉన్న అభ్యర్థులకు శాయశక్తుల కృషిచేసి గెలిపిస్తామన్నారు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఐజయ్య . మొత్తానికి ఎన్నికల వేళ జంపింగ్ జిలానీలతో ఎన్నికల హీట్ మరింత పెరుగుతోంది.

Similar News