ప్రజాసేవకే నా జీవితం అంకితం మాజీ ఎంపీ కవిత

Update: 2019-05-24 03:57 GMT



దేశం మొత్తాన్ని అందరి వైపు ఆకర్షించిన నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది కేవలం నిజామాబాద్ మాత్రమేనని చెప్పాలి . ఎంతో ఉత్కంటగా సాగినా ఈ పోరులో కేసీఆర్ కూతురు కవిత పై బీజేపి అభ్యర్ది ధర్మపురి అరవింద్ అరవై వెయిల ఓట్లకు పైగా విజయం సాధించిన సంగతి తెలిసిందే .. అయితే తన ఓటమి అనంతరం కవిత స్పందించారు ..

తానూ నిజామాబాద్ లో ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉంటానని ప్రజాసేవకే నా జీవితం అంకితం అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు .. తెలంగాణా ఉద్యమ సమయంలో తానూ పోరాటం చేసానని నిజామాబాద్ నియోజకవర్గంలో చిత్తశుద్దితో పనిచేశానని ఆమె అన్నారు ..

ఐదేళ్ళు నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు కవిత .. ఇక నిజామాబాద్ ఎంపీ గా గెలిచినా ధర్మపురి అర్వింద్ కి శుబాకాంక్షలు తెలిపారు కవిత .. 

Similar News