అవనిగడ్డలో టీడీపీకి షాక్‌..!

Update: 2019-03-19 09:54 GMT

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరితే టీడీపీ నుంచి కొంతమంది వైసీపీలో చేరిపోతున్నారు. తాజాగా అధికార పార్టీ టీడీపీకి మరో షాక్ తగిలింది. అవనిగడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్‌ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. కాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మంగళవారం సాయంత్రం వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు తమకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే టీడీపీని వీడుతున్నట్టు తెలిపారు.గత 2014 ఎన్నికల్లో తనను కాదని మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నీ బాధ్యత నేను తీసుకుంటానని తప్పకుండా పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పి మోసం చేశాడని వాపోయాడు.

Similar News