కారు షాకులతోనే కకావికలమైన కాంగ్రెస్కు కమలం పార్టీ ఖతర్నాక్ ఝలక్ ఇచ్చింది. ఆపరేషన్ ఆకర్ష్తో టీ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందే ఆపరేషన్ కమలం దెబ్బకు కాంగ్రెస్ కు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ ఊహించని విధంగా బీజేపీ గూటికి చేరి, టీ కాంగ్రెస్కు షాకిచ్చారు. ఇప్పుడు డీకే అరుణ బాటలోనే కాంగ్రెస్ నేతలు వరుసగా కమలం బాట పడుతున్నారు. డీకే అరుణ బాటలో మరో కాంగ్రెస్ మహిళా నేత బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. మెదక్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. బీజేపీలో గూటికి చేరితే మెదక్ ఎంపీగా, పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.