మాజీ మంత్రి హరీశ్రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 2017లో మంజీర నీటిని శ్రీరాంసాగర్కు తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తాగునీటి కోసం ఉన్న మంజీర నీటిని ఎందుకు తరలించారన్నారు. ఆ నీళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్ ఆశయానికి ఆయన తూట్లు పొడిచారని, కేసీఆర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను గెలిస్తే ప్రశ్నిస్తాననే గతంలో జైల్లో పెట్టించారని చెప్పారు. చేసిన తప్పుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.