జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పుల్వామాలోని దాలిపొరలో దాడులకు తెగబడ్డారు. భద్రతాబలగాలపైకి కొందరు మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఒక జవాను మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాలిపొరలో ముష్కరుల కోసం ప్రత్యేక పోలీసు దళం జవాన్లతో కలిసి కూంబింగ్ నిర్వహిస్తోంది. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు పరారైన ముష్కరుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి జప్తు చేసుకున్నారు. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.