డుంకాలో ఎదురుకాల్పులు..

Update: 2019-06-02 04:15 GMT

జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. నలుగురు ఎస్‌ఎస్‌బీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జార్ఖండ్‌లోని డుంకా వద్ద చోటుచేసుకుంది. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

Similar News