ఓ వైపు ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నంతగా మాటల తూటలతో ప్రచారంలో ఒకరిపై మరోకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మొత్తానికి వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.