నిజామాబాద్‌లో ఇవాళ మొదటిదశ మాక్‌ పోలింగ్‌

Update: 2019-04-03 04:53 GMT

185 మంది అభ్యర్థులతో రికార్డ్ సృష్టించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికల నిర్వహణపై యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో ఇవాళ ఎన్నికల అధికారులు మాక్‌ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ ఎన్నిక కోసం 12 బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై ఈవీఎంలతో పాటు ఓ కంట్రోల్‌ యూనిట్‌ వీవీప్యాట్‌ను ఉంచుతారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించనున్న ఈ మాక్‌ పోలింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ నిజామాబాద్‌కు వస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో మాక్‌ పోలింగ్‌ జరగనుంది.  

Full View

Similar News