కోడ్ ఉల్లంఘనకి పాల్పడిన ఏ పార్టీనీ ఉపేక్షించేది లేదన్నారు ఈసీ రజత్ కుమార్. జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు అధికారులతో సమావేశమయ్యామని, కోడ్ని సీరియస్గా అమలు చేయాలన్నారు. హైద్రాబాద్లో ఇప్పటి వరకు 90 లక్షల నగదు పట్టుకున్నామని, 4వందల 32 ఫ్లయింగ్ స్క్వాడ్ని యాక్టివ్ చేశామన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఎన్నికల సమయంలో బ్యాన్ చేయాలని ఫిర్యాదు అందిందని, కానీ మాకున్న రూల్స్ ప్రకారం సినిమా విడుదలను ఆపడం సాధ్యం కాదన్నారు. ఒకవేళ సినిమా పార్టీని కించపరిచే విధంగా ఉందని తెలిస్తే కేసులు నమోదు చేస్తామని రజత్ కుమార్ వివరించారు.