వాళ్ల ప్రచారాన్ని నమ్మోద్దు.. మే 23న అనూహ్య రీతిలో ఫలితాలు :శివాజీ

Update: 2019-04-13 10:56 GMT

ఏపీ ఎన్నికల సరళిపై ప్రముఖ నటుడు శివాజీ స్పందించారు. ఈ మేరకు శివాజీ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. బీజేపీ పార్టీ ఓ కొత్త నాటకానికి తెరతీసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీచేసినా అన్ని స్థానాల్లోనూ (16) సీట్లు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 17 ఎంపీ సీట్లు వస్తాయని, తొలివిడత జరిగిన పోలింగ్‌లో ఎన్డీయేకు మరో 39 సీట్లు కలిపి మొత్తం 72 స్థానాలు తమ సొంతమవుతాయని బీజేపీ జోరుగా ప్రచారం చేసుకుంటోందని వివరించారు.

అయితే ఈ ప్రచారాన్ని ఎన్నికలు ముగిసిన మరునాడు శుక్రవారం మరింత ఉద్దృతం చేశారని, అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెస్ట్‌ సీఎం అంటూ ప్రశాంత్‌ కిషోర్‌ పొగడడం వంటి కొన్ని వీడియోలు విడుదల చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే ఇవి కేవలం ఊహలు మాత్రమేనని శివాజీ కొట్టిపారేశారు. వచ్చే నెల 23న అనూహ్య ఫలితాలు ఉండబోతున్నాయని శివాజీ ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ పార్టీల దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరూ పట్టించుకోవోద్దని అన్నారు. 

Similar News