జగన్‌పై దేవినేని ఉమ ఫైర్...

Update: 2019-03-26 04:56 GMT

టీఆర్‌ఎస్ , వైసీపీ రహస్య బంధం ముసుగు తొలగిపోయిందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ విషయాన్ని నిన్నటి ఎన్నికల సభలో జగనే స్వయంగా అంగీకరించారని చెప్పారు. వెయ్యి కోట్ల రిటర్న్ గిఫ్ట్ కోసం ఏపీని కేసీఆర్‌కు తాకట్టు పెట్టడానికి జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు. తెలంగాణ నుంచి డబ్బు తెచ్చి ఏపీలో వెదజల్లుతున్నారన్న దేవినేని ఉమ ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న కేసీఆర్‌కు జగన్ వంతపాడమేంటని ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థులను కేసీఆర్, బీజేపీ నేతలు ఎంపిక చేశారని ఆ కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని దేవినేని ఉమ అన్నారు.

Similar News