మోడీ వేడి తగ్గిందని కాంగ్రెస్ గాడి తప్పిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్కు జోష్ లేదని బీజేపీకి హోష్ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీలకు మరోసారి బుద్ధి చెప్పాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీకి లాభం చేకూరుతుందని కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం చేకూరుతుందని అదే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం చేకూరుతుందన్నారు.
తెలంగాణ హక్కుల సాధన కోసం పేగులు తెగేదాక కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్. ఢిల్లీ గులాంలు కావాలా? తెలంగాణ గులాబీలు కావాలా? ఆలోచించుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగిందేమీ లేదు. వాటి పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి సాధించలేదు. దేశంలో ఇంకా పేదరికం ఉంది. రాష్ట్రంలో గిరిజనులు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం సీఎం కేసీఆరే అని అన్నారు.