అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్ల గల్లంతు-దత్తాత్రేయ

Update: 2019-03-02 11:03 GMT

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షలా 35 వేల ఓట్లు తొలగించారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను కలిసిన బీజేపీ నాయకులు బూత్‌ లెవెల్‌ అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల సరైన వెరిఫికేషన్‌ చేయలేదన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో ఓట్ల గల్లంతు ఎక్కువగా ఉందని వారికి మళ్లీ ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈసీని కోరినట్లు వివరించారు. 

Similar News