పురంధేశ్వరికి వైసీపీ బంపర్ ఆఫర్..

Update: 2019-04-30 05:38 GMT

బీజేపీ నేత విశాఖ నుండి ఎంపీగా బరిలో దిగింది దగ్గుబాటి పురంధేశ్వరి. అయితే దగ్గబాటి పురంధేశ్వరికి వైసీపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ ప్రకటించింది ఎవరో కాదు స్వయనా ఆమె భర్త వైసీపీ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. సోమవారం ఓ ఇంటర్వ్యూలో దగ్గుబాటి మాట్లాడారు. అయితే వైసీపీలోకి వస్తే ఆమెకు కోరుకున్న పదవి ఇస్తామని దగ్గుబాటి తెలిపారు. ఏపీ బీజేపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని వీడడం సరైంది కాదనే అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చారని వెంకటేశ్వరరావు చెప్పారు.

కాగా పురంధేశ్వరికి వైసీపీ దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఇప్పుడే కాదు గతంలోనూ వైసీపీ నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వచ్చాయని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నందున అతడి కోసం అవసరమైతే తాను రాజకీయాల నుండి దూరంగా ఉండాలని కూడా భావించారని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. చెంచురామ్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఈ విషయమై తనతో పురంధేశ్వరీ చర్చించారని తెలిపారు. వైసీపీలో ఏ స్థానం కోరుకున్నా ఆమెకు ఇచ్చేందుకు వైసీపీ రేడీగా ఉందన్న విషయాన్ని దగ్గుపాటి ప్రస్తావించారు. అయితే బీజేపీ పార్టీని వీడేందుకు పురంధేశ్వరీ ఒప్పుకోలేదన్నారు. కాగా భవిష్యత్‌లో వైసీపీ గూటికి చేరేందుకు పురంధేశ్వరి సిద్ధంగానే ఉందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన విషయాలు వెల్లడించారు.  

Similar News