రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Update: 2019-06-01 13:25 GMT

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంచారు. మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డీఏ పెరిగింది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

Similar News