మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్కు నందిగామ కోర్టు షాకిచ్చింది. మద్యం తాగి బస్సు నడిపిన కేసులో పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బుజ్జికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ నందిగామ కోర్టు తీర్పు ఇచ్చింది. అతని లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నట్లు నందిగామ కోర్టు ప్రకటించింది. బుధవారం రాత్రి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన డ్రైవర్ పట్టుబడటంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యాన్ని వీడి మద్యం తాగి నడిపే డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.