ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

Update: 2019-05-23 02:42 GMT

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుంచి ఎన్నికల అధికారులు కౌంటింగ్‌ ప్రారంభించారు. అత్యంత పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో హోరాహోరీన తలపడిన అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య పండగలో ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు ఫలితాల కోసం ఉద్వేగంతో వేచి చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌, ఒడిశ శాసనసభలకు జరిగిన ఎన్నికలు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు గెలుపు తమదేనని బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ఓటరు తీర్పు ఎలా ఉందోనన్న గుబులు రెండు పార్టీల్లోనూ ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగడంతో గెలుపు ఎవరిదన్న అంచనా చిక్కక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులతో పాటు ప్రజలంతా తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలతో మరింత గందరగోళం మరింత పెరిగింది. ఎవరికి వారుగా భిన్నమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడం తో ఈ జోస్యాలు మరింత ఉత్కంఠను రేకెత్తించాయి.


Similar News