ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరగబోతోందా?

Update: 2019-02-21 06:16 GMT

ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరగబోతోందా? చంద్రబాబు టార్గెట్‌గా విచారణ జరుగుతోందా? రెండ్రోజుల ఈడీ విచారణలో రేవంత్‌ను అడిగిన ప్రశ్నలేంటి? ఈడీ అధికారులు వేధిస్తున్నారని రేవంత్‌ ఎందుకన్నారు? అసలు ఓటుకు నోటు కేసులో తర్వాత ఏం జరగబోతోంది?

ఓటుకు నోటు కేసులో రెండో రోజు రేవంత్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడుగుతూ వేధిస్తున్నారని రేవంత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారన్న రేవంత్ ఏపీ సీఎంను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సహకారంతో కేసీఆర్ ఈడీని ఉసిగొల్పారన్న రేవంత్‌రెడ్డి తనపై ఇప్పటికే 66 కేసులు ఉన్నాయని, ఇది ఇంకో కేసు మాత్రమేనని, ఈడీ విచారణతో కేసీఆర్ నన్నేమీ చేయలేరన్నారు. 

Full View

Similar News