కాంగ్రెస్కు గుడ్బై చెప్పి కమళం గూటికి చేరుతున్న తరుణంలో పొంగులేటి కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నేత పొంగులేటి సుధార్ రెడ్డి పార్టీపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కమర్షియల్ పార్టీగా మారిందంటూ విమర్శించారు. దేశ భద్రత విషయంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. సర్జికల్ దాడులకు ఆధారాలు అడగడం ద్వారా కాంగ్రెస్ నాయకులు చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్లో ప్రస్తుతం దళారులదే రాజ్యమన్న ఆయన పార్టీలో తన లాంటి విధేయులకు చోటు లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ డబ్బు అడుగుతున్న నేతలు తెలంగాణలో పార్టీ ఓడిపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో నాయకత్వం ఘోరంగా విఫలం కావడం వల్లే ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వానికి లోక్ సభ బాధ్యతలు అప్పగించారంటూ ఎద్దేవా చేశారు.