తెలంగాణలో ఆంధ్రా ప్రజలపై దాడులు చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం సభలో మాట్లాడటం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత కూడా ఆంధ్రాప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని అన్నాదమ్ములమాదిరిగా ఎంతో సఖ్యతతో ఉన్నామని గుర్తు చేశారు. తెలుగురాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న పవన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్ రెడ్డి, సీ.హెచ్ ఉపేందర్, తూడి శ్రీధర్ తదితరులు ఉన్నారు.