సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్
ఆస్తుల కేసు వ్యవహారంలో సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్లో కోరారు.
ఆస్తుల కేసు వ్యవహారంలో సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 20కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. అలాగే జగన్ ఆస్తుల కేసును కూడా ఈ నెల 20కి వాయిదా వేసింది న్యాయస్థానం.