విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు గ్రామంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.