శ్రీరంగం ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్

Update: 2019-05-13 07:29 GMT

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించున్నారు. కేసీఆర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌ తదితరులున్నారు. సాయంత్రం 4.30 గంటలకు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించనున్నారు. 

Similar News