4న కాళేశ్వరం పర్యటనకు కేసీఆర్‌

Update: 2019-06-03 01:53 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 4న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం సీఎం హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం పర్యటనకు ఆయన బయల్దేరతారు. మొదట రాంపూర్‌ చేరుకుని అక్కడ పంపుహౌస్‌ పనులను పరిశీలిస్తారు. ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరిగే పనులను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడుతారు. 

Similar News