మూడోరోజు సహస్ర మహా చండీయాగం
ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ తలపెట్టిన సహస్ర మహా చండీయాగం మూడో రోజు కొనసాగుతోంది. కేసీఆర్ దంపతులు తొలుత రాజశ్యామల మంటపానికి అమ్మవారికి తొలిపూజ చేశారు.
ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ తలపెట్టిన సహస్ర మహా చండీయాగం మూడో రోజు కొనసాగుతోంది. కేసీఆర్ దంపతులు తొలుత రాజశ్యామల మంటపానికి అమ్మవారికి తొలిపూజ చేశారు. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మీ పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహపూజలు నిర్వహించారు. సహస్ర మహా చండీ పారాయణ మంటపంలో చండీమాత పూజలు నిర్వహించారు.