ఈబీసీల రిజర్వేషన్ బిల్లుపై వ్యూహం సిద్ధం చేసిన టీఆర్ఎస్
దేశ వ్యాప్తంగా ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై టీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసింది.
దేశ వ్యాప్తంగా ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై టీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసింది. బిల్లు కోసం నిర్వహించే రాజ్యాంగ సవరణ చర్చలో పాల్గొనాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈబీసీల తరహాలో తాము కోరుతున్నట్టు వెనుకబడిన ముస్లీంలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలను ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ గతంలో చేసిన తీర్మానాలను చర్చ సందర్భంగా ప్రస్తావించాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం.