ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్కు కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. పాలనలో నూతనంగా తీసుకురానున్న సంస్కరణలతో పాటు మునిసిపల్ చట్టంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల పోలింగ్పై గవర్నర్తో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా శాఖల చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నేటి సాయంత్రం గవర్నర్తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.