వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. నిపుణులతో కూడిన మిషన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 2 వేల కోట్లతో విపత్తు నిధి ఏర్పాటు చేయాలని ప్రతి నియోజకవర్గంలో బోర్లు కోసం మిషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.