పార్టీ అభ్యర్ధులకు చంద్రబాబు హెచ్చరికలు ..!

Update: 2019-03-30 05:27 GMT

టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారం, నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్ధితి, మార్పులు చేర్పులపై చంద్రబాబు సమీక్షించారు. ఇకపై ఎన్నికల్లో ఓడిపోతే సామాన్య కార్యకర్తలుగా పని చేయాలంటూ తేల్చి చెప్పారు. ఇకపై ఇన్‌చార్జులుగా ఎవరూ ఉండరని అంతా కార్యకర్తలే అంటూ ఆయన సూచించారు. ప్రచారానికి 10 రోజులే మిగిలి ఉన్నందున ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటూ సూచించారు . కాగా నేటి మధ్యాహ్నం వరకు బాబు నివాసంలోనే తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షలు చేయబోతున్నారు.ఇక అనంతరం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి అక్కడ జరగనున్న ప్రచారంలో పాల్గొని, రాత్రి అక్కడే బస చేస్తారు.

Similar News