మన గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

Update: 2019-05-20 05:39 GMT

పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్ ఏర్పాట్లపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇవాళ మరోసారి ఢిల్లీ చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమరావతి నుంచి ఢిల్లీకి చంద్రబాబు పయనమవుతారు. హస్తినలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ మైండ్ గేమ్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మన గెలుపును ఎవరూ ఆపలేరని, 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని స్పష్టం చేశారు. 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు ప్రారంభమవుతుందని, ఇది 120-130వరకూ వెళ్లొచ్చని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసింది. రేపు అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం. వీవీ పాట్లు లెక్కించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తామని చంద్రబాబు అన్నారు.

Similar News