మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. వివేకానంద కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రిగా బాధ్యతలు నిర్వహించి కోట్లాది మంది ప్రజల అభిమానం పొందారంటూ బాబు కొనియాడారు. వివేకానంద ఆత్మకు శాంతి కలగాలంటూ ఆయన సంతాపం తెలిపారు.