సీఎల్పీ లీడర్ను ఎన్నుకునే బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఏకవాక్య తీర్మానం చేసింది. ఏఐసీసీ పరిశీలకులు వేణుగోపాల్ నేతృత్వంలో సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో రెండో దఫా చర్చలు జరిపిన కాంగ్రెస్ శాసనసభా పక్షం సీఎల్పీ లీడర్ను ఎన్నుకునే బాధ్యత రాహుల్కే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎల్పీ నేత రేసులో ఉన్నట్లు సమాచారం.