ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..

Update: 2019-06-05 08:21 GMT

ఏపీ సీఎం జగన్‌కు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి నారా చంద్రబాబు సీఎంకు జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇన్నాళ్లు తన అధికారిక కార్యకలాపాలకు వినియోగించిన ప్రజావేదికను ఇక నుంచి తన అధికారిక నివాసంగా కేటాయించాలని చంద్రబాబు లేఖలో కోరారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ప్రైవేటే ప్రాపర్టీలోనే ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపిన చంద్రబాబు.. ప్రజావేదికను వాడుకునేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

Tags:    

Similar News