మహిళలు అంతా టీడీపీతోనే నడుస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యర్ధుల ఆరోపణలు తిప్పికొట్టడంతో చురుగ్గా వ్యవహరిస్తున్నారన్నారు. మిషన్ 2019లో భాగంగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రకటించిన 10 సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని మోడీ మరోసారి ఏపీపై తనకున్న కక్షను చాటుకున్నారని బాబు ఆరోపించారు. చేయని పనులు చేసినట్టు చెప్పడం ద్వారా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించారంటూ విమర్శించారు. ఏమరుపాటుగా ఉంటే రాష్ట్రం నేరగాళ్ల వసమవుతుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రజలతో మమేకం కావాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.