రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా బయల్దేరిన చంద్రబాబు

Update: 2019-02-12 06:21 GMT

కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబు, టీడీపీ నేతలతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలవనున్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలులో కేంద్రం తీరుపై.. రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నారు. చంద్రబాబుతో పాటు పలుపురు టీడీపీ ఎంపీలు, ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు, పలు ప్రజా సంఘాల నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. 

Similar News