ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రచారం ముగిసిన వెంటనే మోడీ కేదార్ నాథ్ వెళ్లడం, అమిత్ షా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఆలయాల సందర్శనతో ఓటర్లను ప్రభావితం చేశారంటూ ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు ఆరోపించారు. ఆలయాల సందర్శన పేరుతో పరోక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ, అమిత్ షాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు కోరారు. మోదీ ఆధ్యాత్మకి పర్యటనను మీడియా నిరంతరం ప్రసారం చేయడంతో పలువురు ఓటర్లను అది ప్రభావితం చేస్తుందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు.