కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కౌంటింగ్లో ఆఖరి నిమిషం వరకు ఎవరూ బయటకు రావద్దని కోరారు. బూత్, ఏరియా, నియోజకవర్గం దశలుగా నివేదికలు పంపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో వందశాతం మహిళలు, బీసీలు టీడీపీ ఆదరించారని చెప్పారు. జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇంత పోరాటం ఎదుర్కొనలేదని పేర్కొన్నారు. ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైసీపీ, బీజెపీలు కుట్రలు సాగిస్తాయని తెలిపారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.