ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు బెటర్.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ఏపిలోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఎన్నికల ఫలితాల పైన తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఇక తాజాగా ఎన్డీఏ అధికారంలోకి రాకుంటే రాహల్ ప్రధాని అవుతారనే ప్రచారాన్ని కొంత మంది మిత్రపక్ష నేతలే ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకోచ్చారు శరద్ పవార్. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, మాజీకేంద్రమంత్రి శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానమంత్రి పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ఉత్తమమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి వస్తే మమతా బెనర్జీ, మాయావతి, చంద్రబాబులు కూడా బెటర్ ఆప్షన్ అవుతారని అన్నారు. శుక్రవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాయావతి, మమత బెనర్జీ లేదంటే చంద్రబాబు ఎన్డీయేతర పక్షాల నుంచి దేశ ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురూ అర్హులే. కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడమే ఉత్తమం అని అన్నారు.