లోక్సభ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. షెడ్యూల్ రిలీజ్ కావడంతో వీలైనంత త్వరగా అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తోంది. ఈనెల 14న సోనియాగాంధీ నివాసంలో సమావేశంకానున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లోక్సభ అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. తొలి విడతలోనే ఏపీ, తెలంగాణ అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తున్న అధిష్టానం ముఖ్యంగా తెలంగాణలో బలమైన అభ్యర్ధుల కోసం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో అవసరమైతే ఎమ్మెల్యేలను కూడా లోక్సభ బరిలోకి దించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.