మోదీ సర్కార్ రాఫెల్ డీల్పై రచ్చ రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలకు ఎదురు దెబ్బ తగిలింది. గతంలోని యూపీఏ సర్కార్ కంటే ఇప్పటి మోదీ సర్కార్ రాఫెల్ డీలే బాగుందని కాగ్ తేల్చి చెప్పింది. రాఫెల్ ఒప్పందంపై రాజ్యసభలో కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాలు ముగిసే చివరి రోజు ఈ నివేదికను రాజ్యసభ ముందుకు తీసుకొచ్చారు. ఈ నివేదిక కొత్త డీల్ను సమర్థించింది. యూపీఏ హయాంలో చేసుకున్న డీల్తో పోలిస్తే ఇది 2.8 శాతం తక్కువని కాగ్ స్పష్టం చేసింది. గతంలో 126 రాఫెల్ విమానాల ఒప్పందంతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వం 36 ఫైటర్ జెట్స్ కోసమే ఒప్పందం చేసుకుంది. అయితే ఈ విమానాలకు చేయాల్సిన కొన్ని కీలక మెరుగులను భారత్లోనే చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల దేశానికి 17.08 శాతం మేర డబ్బు ఆదా అయిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.