ప్రజాసమస్యలే నా సమస్యలని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుంటాని, అవినీతిని ప్రశ్నిస్తానంటూ తానే స్వంతంగా పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడ్ని ఎందుకు ప్రశ్నించడంలేదని వైసీపీ నేత సి. రామచంద్రయ్య పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. మంగళవారం రామచంద్రయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ అధికార పార్టీ టీడీపీ పార్టీ వైఫల్యాలను చెప్పకుండా పవన్ కళ్యాణ్ కేవలం ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా వైఫల్యంపై చంద్రబాబును ఎందుకు ప్రశ్నించారని అడిగారు. చంద్రబాబు, పవన్ల మధ్యవర్తిగా లింగమనేని రమేష్ పనిచేస్తున్నారన్నారు. తన వరకు మాట్లాడుకొని గత 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదని, ఈ సారి మాత్రం రహస్య ఒప్పందాలతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల ఏపీకి నష్టం జరుగుతుందంటున్న పవన్ కేసీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు, అవినీతి అన్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తెలుసనని, అయినప్పటికీ అతను ప్రశ్నించడం లేదని విమర్శించారు.