ప్రజలపై చంద్రబాబు చూపే ప్రేమ సునామీని తలపిస్తుంది

Update: 2019-01-22 11:38 GMT

కేబినెట్ మీటింగులో ప్రజలపై చంద్రబాబు చూపే ప్రేమ సునామీని తలపిస్తోందని మాజీ మంత్రి వైసీపీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. అగ్రకులాల మద్య బిజెపి చిచ్చు రేపుతుంటే బాబు కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. కులాల మద్య కుంపటిని రగిల్చే ప్రయత్నం చేస్తున్న బాబు కాపుల రిజర్వేషన్ కు సంబందించిన బిల్లుపై కేంద్రానికి నివేదిక పంపకపోవడం సిగ్గు చేటన్నారు. '2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏమేరకు అమలు చేశాడో ప్రజలు గమనించాలి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైఎస్‌ జగన్‌ చెప్పిన 'నవరత్నాలు'లోంచి ఒక్కొక్కటి వదులుతున్నాడు. నాలుగున్నరేళ్లుగా అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం గురించి తెగ ఆలోచిస్తున్నారు. మీకు సంక్షేమం అంటే ఏంటో తెలుసా బాబూ' అని రామచంద్రయ్య ప్రశ్నించారు.

Similar News