తెలుగుదేశం పార్టీకి సాంకేతిక సేవలందిస్తున్న మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 'ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' సంస్థపై నమోదైన కేసు దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ విషయంపై బుగ్గన మాట్లాడుతూ ప్రగతి కోసం సమాచారం సేకరించడం లేదన్నారు వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ వాడుకుంటోందని ఆరోపించారు. టీడీపీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని, డేటా చోరీ చేసిన పార్టీగా టీడీపీని ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు టీడీపీ అమ్మేసిందని విమర్శించారు రాజేంద్రనాథ్రెడ్డి.