మహాకూటమికి బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్ బై చెప్పారు. సమాజ్వాదీ పార్టీ తమ సొంత ఓటు బ్యాంకును పొందలేకపోయిందన్నారు. దీంతో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని మాయావతి అభిప్రాయపడ్డారు. మహాకూటమి బ్రేకప్ శాశ్వతం కాదు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ భవిష్యత్లో మంచి విజయాలు సాధిస్తే అతనితో కలిసి పని చేస్తామని తెలిపారు. త్వరలో యూపీలో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని మాయవతి స్పష్టం చేశారు.