ఏపీలో జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. విశాఖలో పవన్కల్యాణ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆమె పవన్ కల్యాణే సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. ఏపీకి కొత్త నాయకత్వం అవసరం అని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధి జరిగి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఉండేది కాదన్న ఆమె ప్రస్తుతం ఏపీ కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
దళిత ముఖ్యమంత్రి నినాదంతోనే తెలంగాణ ఉద్యమం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీఎస్పీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లడం సంతోషంగా ఉందన్న ఆయన మాయావతి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. దేశరాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ప్రభావం చూపెట్టింది బీఎస్పీ అని అన్నారు.