సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలకమైన ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ రామ్చరిత్ర నిషాద్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీ లో చేరారు. గత ఎన్నికల్లో యూపీలోని మచిలీషహర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అయనకు తిరిగి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. కాగా నేడు (శనివారం) లక్నోలో ఎస్పీ కార్యాలయంలో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాదీ పార్టీ గూటికి చేరారు. ఓ విధంగా బీజేపీకి ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.