మంత్రి గంటా శ్రీనివాస్పై బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీల మధ్య కాదు తనకు గంటాకు మధ్యే పోటీ అని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా భీమిలిలో మంత్రి అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతికి, దోపిడీకి పరాకాష్టగా గంటా మారారని ఎద్దేవా చేశారు. ఈ సారి ఓటర్లు మంత్రి గంటాకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.