మహబూబ్నగర్లో జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో బీజేపీ కార్యకర్త హత్య జరిగిని విషయం తెలిసిందే. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు రాజాసింగ్. బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడిల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కత్తులతో పొడవడం దారుణమన్నారు. ఈదారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.