వైసీపీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీలో రేగిన అసంతృప్తి కొనసాగుతోంది. విజయవాడలో వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎంఎస్ బేగ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకర్గం ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సీటు అని, అలాంటి స్థానాన్ని ఆరెస్సెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ వైకాపా అసంతృప్త నేత ఎంఎస్ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలతో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి 20 సార్లు ప్రయత్నించానా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు.